Home Page SliderNationalPoliticstelangana,

కేంద్రప్రభుత్వ పథకాలకి ఇందిరమ్మ పేరెలా పెడతారు..బీజేపీ ఎంపీ ఫైర్

కేంద్రప్రభుత్వ పథకాలకి ఇందిరమ్మ పేరు పెట్టడాన్ని తప్పు పట్టారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రధాని ఆవాసయోజన పథకం ద్వారా పేదలకు ఇళ్లు ఇవ్వడానికి ప్రతిపాదిస్తే, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కమిటీలకు ఒక విధానం లేదన్నారు. గ్రామసభలు పెట్టి ఇళ్ల లబ్ది దారులను ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్లు ముట్టజెప్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయితీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.