Home Page SliderInternational

లోయలో బస్సు పడి.. 45 మంది మృతి.. బ్రతికిన 8 ఏళ్ల బాలిక

Share with

జోహెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుండి లోయలో పడడంతో 45 మంది మృతి చెందారు. దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెనపై నుండి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందారు. 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 165 అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది. మొత్తం 46 మందితో కూడిన బస్సు బోట్స్‌వానా నుండి మోరియాకు బయలు దేరింది. కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపు తప్పడంతో బస్సు లోయలో పడ్డట్లు తెలిసింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సైతం చనిపోగా, ప్రాణాలతో బతికున్న బాలికను ఆసుపత్రికి ట్రీట్‌మెంట్‌కై తరలించారు. బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.