Home Page SliderTelangana

అమ్మ చెంతకు చేరే లోపే ప్రాణాలొదిలింది..

ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక. సోమవారం లావణ్య గ్రూప్ -3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఉంది. మధ్యాహ్నం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా పరుగెత్తుతూ కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ లో నొప్పి వస్తోందని చెప్పింది. వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు చెప్పారు. ఎప్పుడూ హుషారుగా ఉండే కూతురు ఉన్నట్లుండి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.