బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా సీనియర్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. నెలరోజుల ఉత్కంఠ అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం బుధవారం నియమించింది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉండటంతో మహేశ్వర్ రెడ్డికి ఛాన్స్ దక్కింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకట రమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. కాగా ముధోలే ఎమ్మెల్యే రామారావు పటేల్ను శాసనసభా పక్ష కార్యదర్శిగా నియమించారు. పార్టీ చీఫ్ విప్గా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, విప్గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరయ్యనారాయణ గుప్తా నియమితులయ్యారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్రెడ్డిని పార్టీ కోశాధికారిగా నియమించారు.