బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 20 సీట్లు: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీ అభ్యర్థుల ప్రకటన రావచ్చని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల ప్రకటన వెలువడొచ్చని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. 3 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుండి 50 కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తిచేసినట్లు వివరించారు. ఢిల్లీలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తోంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నాం. మహిళా రిజర్వేషన్కు సంబంధించి ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు. కానీ, మహిళలకు బీజేపీ సీట్లు కేటాయించలేదు. కాంగ్రెస్, బీజేపీ బీసీలను పట్టించుకోలేదు. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

