టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు గుండెపోటుతో మృతి
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు చంద్రమౌళి గుండెపోటుతో మృతి చెందారు. గత 3 రోజులుగా చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఎక్మో ఆధారిత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హార్ట్ ఎటాక్ రావడంతో మల్లిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు 3 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో ముహూర్తం నిర్ణయించగా.. చంద్రమౌళి తన పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారు. ఆదివారం చన్నై ఆళ్వారుపేటలో బంధువులకు ఆహ్వానపత్రిక అందజేశారు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

