కవిత రాజీనామా ఎందుకు ఆమోదించడం లేదు?
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఆమోదించకపోవడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, “సీఎం రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే రాజీనామా ఆమోదం జరగడం లేదని” ఆరోపించారు. “స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని సమర్పించినా, దానిని ఆమోదించని అసమర్థ పాలన రాష్ట్రంలో కొనసాగుతోంది,” అని అర్వింద్ ధ్వజమెత్తారు.

