NewsTelangana

ఎమ్మెల్యే సీతక్క ఓటు హక్కు వినియోగించుకున్నారా?

Share with

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమెల్యే సీతక్క ఓటు చర్చనీయంగా మారింది. ఓటు వేసెందుకు వెళ్ళిన ఆమె ఇంకా తన బ్యాలెట్ పేపర్‌ను డ్రాప్ బాక్స్ లో వేయలేదు. తనకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌ను మార్చాలని అధికారులను కోరారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓటు వేసేందుకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ పై  ముర్ముకు సంబంధించిన చోట ఇంకు పడిందని ఆమె అధికారులకు తెలిపారు. ఈ కారణంగానే బ్యాలెట్ పేపర్ మార్చాలని అడిగారు. కాని అధికారులు బ్యాలెట్ పేపర్ మార్చాల వద్ద అన్న విషయంపై ఉన్నతధికారులను మెయిల్ ద్వారా సంప్రదంచినట్టు తెలుస్తోంది. బ్యాలెట్ పేపర్ మార్చారా లేదా , ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారా లేదా , పేపర్ మార్చని పక్షంలో ఓటు ముర్ముకి వేసినట్టేనా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.