బడికి మద్యం తాగొచ్చిన లేడి టీచర్
కర్ణాటకలోని చిక్కసారంగిలో మద్యం తాగి విద్యార్థులకు పాఠాలు చెప్తున్న ఓ లేడి టీచర్ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయురాలు గంగ లక్ష్మమ్మ గత ఐదేళ్లుగా మద్యానికి బానిసైంది. దీంతో నిత్యం మద్యం తాగి పాఠశాలకు వస్తుండేది. అదే విధంగా మద్యం మత్తులో పిల్లలు కారణం లేకుండానే కొట్టడం… తోటి టీచర్లతో గొడవలు పడుతుండేది. ఈ కేసుపై విచారణ జరిపిన అధికారులు క్లాస్ రూమ్ డ్రాలో మద్యం బాటిల్స్ గుర్తించారు. అలాగే ఆమెను ఉపాధ్యాయ పదవి నుండి సస్పండ్ చేశారు. పిల్లలను సరైనా మార్గంలో నడిపి వారిని ఉన్నత స్థానాలకు చేర్చే గురువే ఇలా చేయడంతో ఈ వార్త వైరల్గా మారింది.