తెలంగాణా ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత
తెలంగాణా ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్త వాతావరమం నెలకొంది. కాగా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డ్ వద్ద ABVP కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే వారు నాంపల్లి ఇంటర్ బోర్డులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయాత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో గుర్తింపు లేకుండా నడుపుతున్న ఇంటర్ కాలేజీలను రద్దు చేయాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.