ఉదయం 11 గంటలకు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
తెలంగాణ SSC 10వ తరగతి పరీక్షలు రాష్ట్రంలో మార్చి 18 నుండి ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షలను 2,676 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో నిర్వహించారు. ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు SSC బోర్డు విడుదల చేసిన తర్వాత ఫలితాలను అధికారిక వెబ్సైట్ results.bse.telangana.gov.in, results.bsetelangana.org చెక్ చేసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE తెలంగాణ), హైదరాబాద్ ఏప్రిల్ 30న SSC పబ్లిక్ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తుంది.