NewsTelangana

తెలంగాణాలో రాహుల్ భారత్ జోడో యాత్ర

Share with

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెప్టెంబరు 7వ తేదిన భారత్ జోడో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర కాశ్మీర్ వరకు కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్ర ఈ నెల 23న తెలంగాణాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణమండల శివారులో..తెలంగాణాలోకి ప్రవేశించి ఇక్కడ నుంచి ముందుకు సాగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా తెలంగాణాలోని మరికల్ ,దేవరకద్ర,మన్యంకొండ,జడ్చర్ల ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించనుంది. అయితే ఈ పాదయాత్ర తెలంగాణాలోని కామారెడ్డి వరకు ఉంటుంది.  ఈ పాదయాత్ర ప్రతిరోజు ఉదయం 6:30 నిమిషాల నుంచి ఉదయం 11:00 గంటల వరకు, సాయంత్రం 4:30 నిమిషాల నుంచి రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతోంది. ఈ నెల 24,25 వ తేదిలలో దీపావళి పర్వదినం సందర్భంగా ఈ పాదయాత్రకు విరామం.