Home Page SliderTelangana

బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ తొక్కిపెడుతోందన్న ప్రధాని నరేంద్ర మోదీ

Share with

మే 13న తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్ర సృష్టిస్తారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటేస్తారన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ తెలంగాణాను దోచుకుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణాను ఏటీఎంగా మార్చుకుంటుందన్నారు. తెలంగాణ నుంచి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఫైళ్లను పక్కనబెడుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం విచారిస్తే… మోదీని తిట్టడం ప్రారంభిస్తారన్నారు. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబపార్టీలే కారణమన్నారు మోదీ.

రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించామన్నారు ప్రధాని నరేంద్రమోదీ. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచామన్నారు. ఇక్కడి ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్ల తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేస్తామన్నారు. తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తామన్న మోదీ, తెలంగాణలో బిజెపి ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయన్నారు. మాకు అధికారం కాపుడుకోవడం కన్నా.. ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలో ఉంటే.. ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే.. మోడీని తిట్టడం ప్రారంభిస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం బయటపడిందన్నారు. తెలంగాణను దోచుకున్న వారిని తాము విడిచిపెట్టేది లేదన్నారు.

కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయన్నారు. 2 జి స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చిందని, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు బయటకు వచ్చిందని.. ఆ జాబితాలో కుటుంబ పార్టీ బిఆర్‌ఎస్ చేరిందన్నారు. కుటుంబ పార్టీ అయిన బీఆర్‌ఎస్ కాళేశ్వరంలో అవినీతి చేసిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలోనూ బీఆర్‌ఎస్ కు చెందిన నాయకులు అవినీతికి పాల్పడ్డారన్నారు.
కేవలం ఆ రెండు పార్టీలు బీజేపీని, మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు ఎంత కవర్ ఫైర్ చేసినా.. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టబోమన్నారు మోదీ. కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్ఎస్.. లిక్కర్ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుందన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు వారి అవినీతి కొనసాగిందన్నారు. కానీ బీజేపీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. నాకు అంత శక్తి వస్తుందన్నారు. మల్కాజ్‌గిరి రోడ్ షోలో బ్రహ్మరథం పట్టారన్నారు. తెలంగాణ ప్రజలు అబ్‌కీ బార్ 400 సీట్లంటున్నారని చెప్పారు. మహారాష్ట్ర శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ తన పోరాటం శక్తికి వ్యతిరేకమని చెప్పారన్నారు. ప్రతి మహిళా తనకు శక్తి స్వరూపంలో కన్పిస్తోందన్నారు మోదీ. తాను భారతమాతకు పూజిరినని చెప్పారు. శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ చాలెంజ్ తాను స్వీకరిస్తానన్నారు. అసలు శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా అని మోదీ ప్రశ్నించారు. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని శివశక్తిగా పేరు పెట్టుకున్నామన్నారు. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తెలుస్తుందన్నారు.

తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఆంగ్లేయులు, రజాకార్లపై తెలంగాణ సమాజం విరోచిత పోరాటం చేసిందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను దోచుకుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుందన్నారు. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుందన్నారు. తెలంగాణ కలలను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నాశనం చేశాయన్నారు. ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ చెలగాటం ఆడిందన్నారు. అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం సహా దేనిపైనా విచారణ చేయడం లేదన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందన్నారు. వికసత భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. 400 దాటాలి… బీజేపీకి ఓటు వేయాలన్నారు.,