Andhra PradeshHome Page Slider

“భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి”:సీఎం జగన్

Share with

ఈ రోజు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్‌వీ సీ-58‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ  పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.కొత్త ఏడాది ప్రారంభంలో మంచి విజయాన్ని సాధించారని సీఎం ప్రసంశించారు.ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న రీతిలోనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు.అయితే ఇస్రో ఇలానే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాక్షించారు.