Andhra PradeshHome Page Slider

అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ముఖ్యఅతిథిగా మిజోరాం గవర్నర్

Share with

అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ముఖ్యఅతిథిగా మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. చైతన్య విద్యాసంస్థలు, ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ, సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సభలను రాజమహేంద్రవరంలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 2024 జనవరి 5,6,7 తేదీలలో నిర్వహిస్తున్నారు. శ్రీ రాజరాజ నరేంద్ర మహారాజు పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో దీనిని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా చైతన్య విద్యాసంస్థల చైర్మన్ చైతన్యరాజు, ఆంధ్రసారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ విశాఖలో గవర్నర్ హరిబాబును కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన అంగీకరించినట్లు సమాచారం. జనవరి 6 ఉదయం జరిగే కృతజ్ఞతాంజలి సభకు వస్తారని, కళాకారుల్ని సత్కరిస్తారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రమేవ జయతే అనే నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.