Andhra PradeshHome Page Slider

లక్ష్మీ పార్వతి “అల్లుడిసుద్దులు” పుస్తకావిష్కరణ

Share with

ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి రచయిత్రి కూడా అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆమె తాజాగా రచించిన అల్లుడి సుద్దులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీనిలో చంద్రబాబు గురించిన వ్యక్తిగత విషయాలు, సీనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబుకు మధ్య గల రిలేషన్స్ ఈ పుస్తకంలో పొందుపరిచారని సమాచారం. ఈ పుస్తకావిష్కరణ సభలో మంత్రి  అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని చదివితే వెన్నుపోటు రాజకీయాలు, చంద్రబాబు సుద్దులు తెలుస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి. లక్ష్మీపార్వతి చాలాకాలంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరణించినప్పటి నుండి ఆమెకు, వారి కుటుంబానికి ఎటువంటి సత్సంబంధాలు లేవు.