బస్ కండక్టర్గా కర్ణాటక సీఎం … రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ పథకాన్ని జూన్ 11, 2023న సీఎం సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం ‘శక్తి యోజన’ ను స్వయంగా సీఎం సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన కండక్టర్ అవతారం ఎత్తనున్నారు. బెంగళూరులో మెజిస్టిక్ బస్ స్టేషన్ నుంచి విధాన సౌధ రూట్లో నడిచే బస్సులో కండక్టర్గా మారనున్నారు. బస్సులో స్వయంగా మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారని సీఎంఓ తెలిపింది.
రూట్ నెం. 43లో బస్ కండక్టర్గా మహిళలకు స్మార్ట్ కార్డులు అందజేస్తారని.. అనంతరం విధానసౌదలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శక్తి యోజనను సీఎం ప్రారంభిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిన బస్సుల్లో కొన్ని సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేశారు.