Andhra PradeshHome Page Slider

‘జూనియర్ ఎన్టీఆరే సీఎం’ అంటూ ఒంగోలులో ఫ్లెక్లీల రచ్చ

Share with

ఒంగోలులో ‘జూనియర్ ఎన్టీఆర్‌ను సీఎం’గా పేర్కొంటూ టీడీపీ ఫ్లెక్లీల ఏర్పాటు కలకలం రేపింది. టీడీపీ, వైసీపీల మధ్య రచ్చ చేస్తున్నాయి ఈ ఫ్లెక్సీలు. ఈ ఫ్లెక్సీలలో సీనియర్ ఎన్టీఅర్, చంద్రబాబు ఫొటోలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పెట్టి  ‘అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే’ అంటూ కామెంట్ కూడా పెట్టారు. లోకేష్ యువగళం పాదయాత్ర జరగబోతున్న సందర్భంగా ఈ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఈ ఫ్లెక్సీలకు ఫ్రేములు అందించిన వ్యక్తిని కనిపెట్టారు.

అతడు త్రోవగుంట  వాలంటీర్  అఫ్రిది అని తెలియడంతో అతడిని ప్రశ్నించారు. దానికి అతడు తనకేమీ తెలియదని రఘు అనే వ్యక్తి చెపితే కేవలం ఫ్రేములు మాత్రమే ఇచ్చానని తెలిపారు ఆ వాలంటీర్ అఫ్రిది. దీనితో ఈ ఫ్లెక్సీలు వైసీపీ వర్గాల వారే పెట్టించారని టీడీపీ ఆరోపిస్తోంది. యువగళం పాదయాత్ర ఒంగోలుకు చేరనున్న సందర్భంగా ఆ ప్రదేశంలో కలకలం రేపడానికి ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయం అప్పటికే సోషల్ మీడియాలో, వార్తల్లో రావడంతో టీడీపీ ఈ ఫ్లెక్సీలను తొలగించింది.