Andhra PradeshHome Page Slider

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు రూ. 5 వేల కోట్లు

Share with

పార్లమెంట్ ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి దేశ రాజకీయాలను తనవైపు చూసేలా చేశారు. ఎన్నికల అఫిడవిట్లో.. ఆయన ప్రకటించిన ఆస్తుల లెక్క.. వంద, రెండు వందలు కాదు.. ఏకంగా రూ. 5 వేల కోట్లు. ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని గురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన ఏపీలో సుపరిచితుడు. ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తనదైన శైలిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తాజాగా.. ఈవాళ పెమ్మసాని నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన కుటుంబానికి రూ.5,785 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ నిలిచారు. ఆయనకు రూ.1,038 కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన చంద్రశేఖర్ అమెరికాలో చాలాకాలం వైద్య వృత్తిని కొనసాగించారు. వైద్యవృత్తితో పాటు పలు వ్యాపార రంగాల్లో రాణిస్తూ విజయాలు సాధించారు.