Home Page SliderNational

కంగనాకు హిమాచల్ నుండి పోటీ ఇష్టమేనా?

Share with

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుండి అభ్యర్థిగా బీజేపీ పార్టీ ప్రకటించింది. ఈ విషయంలో ఆమెకు పోటీ ఇష్టమేనా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఆమె హిమాచల్ ప్రదేశ్ నుండి కాకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఉండే ప్రముఖ నియోజక వర్గం నుండి ఎన్నికలలో పోటీ చేయాలని ఉందంటూ గతంలో ట్వీట్ చేయడమే. కానీ ఇటీవల ఆమె రాజకీయ ఎంట్రీని ఆహ్వానిస్తూ బీజేపీ ఆమె సొంత రాష్ట్రం నుండి లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. దీనితో ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. అధికారికంగా బీజేపీ పార్టీలో చేరడం తనకు గౌరవంగా ఉందని, బీజేపీ కార్యకర్తగా, విశ్వసనీయ ప్రజాసేవకురాలిగా పేరు తెచ్చుకొనేందుకు ఎదురుచూస్తున్నానంటూ ప్రకటించింది. ప్రియమైన భారత ప్రజల సొంత పార్టీగా భావించే బీజేపీకి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని, అందరికీ ధన్యవాదాలంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. దీనితో ఆమెకు అభిమానుల నుండి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే పొలిటికల్ మూవీలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేశంలోని అప్పటి ఎమర్జెన్సీ పరిస్థితులను వివరించబోతున్నారు.