News

లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ ఈనెల 14 తర్వాతే: హైకోర్టు

Share with

డీబీటీ ద్వారా నగదు జమపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈనెల 14న నగదు జమ చేసుకోవచ్చని గతంలోనే ఇచ్చిన ఆదేశాలను పాటించాలని హైకోర్టు చెప్పింది. ఇవాళ ఒక్కరోజు నగదు బదిలీ చేసేందుకు వెసులుబాటు ఇస్తూ సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ చేపట్టింది. ఈనెల 13న పోలింగ్ కారణంగా, డీబీటీ ద్వారా నగదు బదిలీ ఆ తర్వాత రోజు నుంచి చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. ఈసీ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది.