బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు
కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినందుకు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్కు తెలంగాణ విచారణ బృందం సమన్లు జారీ చేసింది. టీఆర్ఎస్ నుండి నలుగురు ఎమ్మెల్యేలను “కొనుగోలు” చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలపై ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్కు తెలంగాణ పోలీసులు సమన్లు జారీ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ నవంబర్ 21న హాజరుకావాలని, లేదంటే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని రోజుల తరువాత, న్యాయమూర్తి దానిని పర్యవేక్షించాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులకు ఫామ్హౌస్లో 100 కోట్ల ఆఫర్ ఇచ్చినందుకు గాను ముగ్గురు వ్యక్తులను గత నెలలో అరెస్టు చేయగా… వారు బెయిల్ పొందారు.

2024లో ప్రధానమంత్రి మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పాత్రను లక్ష్యంగా చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. కొద్దిరోజుల క్రితం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కూడా విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని నలుగురు ఎమ్మెల్యేలను పరేడ్ చేస్తూ… కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మూడు గంటల రహస్య కెమెరా ఫుటేజీ ఉందని దాంట్లో తాను కేవలం ఐదు నిమిషాలు ప్లే చేశానని చెప్పుకొచ్చారు.

ఆరోపణలన్నీ కేసీఆర్ కుట్రలో భాగమని… కిరాయి నటులతో వీడియోలు రికార్డింగ్ చేశారని బీజేపీ ఆక్షేపించింది. ఆఫర్ను స్వీకరించకుంటే సీబీఐ కేసులు పెడతామని ముగ్గురు వ్యక్తులు చెప్పారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ వంటి “తటస్థ” ఏజెన్సీకి అప్పగించాలన్న బీజేపీ అభ్యర్థనను హైకోర్టు ఈ వారం ప్రారంభంలో తిరస్కరించింది. రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ స్వతంత్ర న్యాయమూర్తిని పర్యవేక్షకుడిగా నియమించింది.

