NewsTelangana

కూసుకుంట్ల గ్రామంలో బీజేపీ లీడ్‌

Share with

మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ మంత్రులకు చుక్కెదురైంది. నాలుగో రౌండ్‌లో బీజేపీ 1100 ఓట్లకు పైగా మెజారిటీ సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గ్రామం లింగవారిగూడెంలోనూ బీజేపీ హవా కొసాగించడం విశేషం. మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఇంచార్జీలుగా ఉన్న గ్రామాల్లో బీజేపీ ఆధిక్యత సాధించింది. ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఒక్క రౌండ్‌ ఫలితాన్ని కూడా తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు.