Andhra PradeshHome Page Slider

ప్రధాని మోదీతో ఏపీ సీఎం భేటీ

Share with

ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో పర్యటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్  ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అయితే దాదాపు గంటా 20 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశంలో విభజన హామీలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్ మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందే సీఎం జగన్ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే సీఎం జగన్ మరికాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో కూడా భేటీ కానున్నట్లు సమాచారం. కాగా ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సీఎం జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.