Home Page SliderTelangana

సికింద్రాబాద్ డీసీసీ చీఫ్‌గా అనిల్ కుమార్ యాదవ్

Share with

సికింద్రాబాద్ డీసీసీ చీఫ్‌గా అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం గాంధీభవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. అనిల్ కుమార్ యాదవ్ పేదల కోసం పోరాటం చేసే వ్యక్తి అని మెచ్చుకున్నారు. గత సీఎల్‌పీ లీడర్ పి. జనార్థన్ రెడ్డి కూడా పేదల కోసం, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, అలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా అంతటి వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఛార్లెస్ శోభరాజ్ లాంటివాడని, అతని మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బిల్లా రంగాల వంటివారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల కోసం కష్టపడి పని చేయాలని, సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు.