Home Page SliderTelangana

స్థానిక సంస్థలపై కమలం కన్ను!

టిజి: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు సాధించడంతో పాటు ఓటు బ్యాంకును 35 శాతానికి పెంచుకున్న దృష్ట్యా.. ఈ స్పీడ్‌ను మున్ముందు కూడా కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పట్టు సాధించేలా క్యాడర్‌ను సన్నద్ధం చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చింది. గ్రామీణస్థాయి నుండి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఎక్కడికక్కడ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది.