పదో తరగతి ఫలితాలలో అదరగొట్టిన అమ్మాయిలు..
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను కొద్ది సేపటి క్రితం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజా ఫలితాలలో అమ్మాయిలదే పైచేయి అయ్యింది. మొత్తంగా ఈ ఫలితాలలో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. అమ్మాయిలు 84 శాతం ఉత్తీర్ణులు కాగా, అబ్బాయిలు 78 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 17 నుండి మార్చి 31 వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

