InternationalNews

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే

Share with

శ్రీలంక దేశ అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎన్నికయ్యారు. దీంతో శ్రీలంక దేశ 8వ కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘె ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 219 ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా అందులో రణిల్‌ విక్రమసింఘే 134 ఓట్లు లభించాయి. దీంతో శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఆయన త్వరలోనే శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 8వ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్‌ విక్రమసింఘె.. ఆ దేశ ప్రధానిగానూ పని చేశారు. కొన్ని రోజులకు ముందు రణిల్‌ విక్రమసింఘె ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోవడంతో… శ్రీలంక ఎంపీలు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘేను ఎన్నుకున్నారు.