Home Page SliderTelangana

తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల

Share with

తెలంగాణాలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.కాగా ఇంటర్ మొదటి,ద్వితియ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకేసారి విడుదల చేశారు. అయితే ఈ ఏడాది 9.50లక్షలమంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5 లక్షలమంది ఉండగా..సెకండియర్ విద్యార్థులు 4.5 లక్షలమంది ఉన్నారు. ఫస్ట్ ఇయర్‌లో 61.68% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..సెకండియర్‌లో 63.49% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. దీంతో ఫస్టియర్‌లో బాలికల ఉత్తీర్ణత శాతం 68.68% ఉండగా..బాలుర ఉత్తీర్ణత 54.66% శాతంగా ఉంది. అయితే సెకండియర్‌లో బాలికల ఉత్తీర్ణత శాతం 71.57% శాతంగా ఉంది. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.