Home Page SliderNational

టీమ్‌ఇండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

Share with

త్వరలోనే అఫ్ఘానిస్తాన్ vs టీమ్‌ఇండియా T20 సిరీస్ జరగనుంది. కాగా ఈ T20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎవరిని నియమించాలనే దానిపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అయ్యర్‌కు కెప్టెన్సీలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా T20 సిరీస్‌కు  ఇప్పటివరకు కెప్టెన్లుగా వ్యవహరించిన హార్థిక్ పాండ్యా,రుతురాజ్ గైక్వాడ్,సూర్యకుమార్ యాదవ్ గాయలపాలయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో T20లకు దూరంగా ఉంటున్న రోహిత్ శర్మను కూడా కెప్టెన్సీ చేపట్టాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనికి కాస్త సమయం కావాలని రోహిత్ శర్మ బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది.