Home Page SliderNational

సినీ రంగాన్ని వెంటాడుతున్న వరుస విషాదాలు

Share with

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాల వెంటాడుతున్నాయి. కాగా గడచిన 3 రోజుల్లోనే నలుగురు నటులు మృతి చెందడం సినీరంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా RRR సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్‌సన్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖ నటుడు శరత్‌బాబు 2 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. అయితే ఈ చేదు వార్తను మరవక ముందే బాలీవుడ్ నటుడు నితీశ్ పాండే ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. నితీశ్ పాండే దబాంగ్,బదాయి హో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా బాలీవుడ్‌లో ఫేమస్ కామెడీ సీరియల్ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైభవి కూడా నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.