Home Page SliderTelangana

నీళ్ల కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుదాం

సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు హరీష్ రావు. ఆ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా కాంగ్రెస్ తో పోరాడుదామని చెప్పారు. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడుదామని సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో హరీష్ రావు సమావేశంలో చర్చించారు.