Home Page SliderTelangana

ఇకపై ఆధార్‌ కార్డుకు పాస్‌పోర్ట్‌ తరహా వెరిఫికేషనే..

Share with

కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకునే వారిని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మాదిరే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేస్తారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌కు సంబంధించిన ఏ అంశాన్నైనా యూఐడీఏఐ నిర్వహిస్తోంది. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను యూఐడీఏఐకి బదులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్ కేంద్రాల్లోకి వెళ్లి ఈ సర్వీస్ పొందవచ్చు. ఆధార్ ప్రాసెస్ అంతా ఈ సేవలో లభించును, కావున అవసరమైన వారు ఈ సేవకు వెళ్లి అప్లై చేసి ఆధార్ కార్డ్ పొందవచ్చు.