Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు మరో 15 రోజులు రిమాండ్ పొడిగింపు

Share with

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడప్పుడే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో ఊరట లభించేలా కన్పించడం లేదు. ఈ కేసులో చంద్రబాబు  అరెస్ట్ అయ్యి నేటికి 27 రోజలు అవుతుంది. అయితే ఈ రోజుతో చంద్రబాబు రిమాండ్ ముగిసింది.దీంతో పోలీసులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టులో జడ్జ్  ముందు ప్రవేశ పెట్టారు. ఈ కేసులో సీఐడీ తరపు న్యాయవాదులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.27కోట్ల రూపాయలు నేరుగా టీడీపీ ఖాతాలో జమ చేసుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు త్వరలోనే సమర్పిస్తామని ఏసీబీ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.ఈ వాదనలు విన్న ఏసీబీ కోర్టు ధర్మాసనం  చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజులు పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 19 వరకు చంద్రబాబు రిమాండును ఏసీబీ కోర్టు  పొడిగించింది.