Home Page SliderTelangana

బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలది ఒకటే బాట… ఝూట్.. లూట్: నిప్పులు చెరిగిన మోదీ

Share with

పటాన్‌చెరు బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండూ ఒకటే. నాణేనికి బొమ్మాబొరుసు లాంటివని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైలును మూసేసిందన్నారు. ‘మీరు తిన్నారు… మేం కూడా తింటాం’ అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండింటిదీ ఒకే బాట.. ఝూట్‌.. లూట్‌ (అబద్ధాలు.. దోపిడీ) అంటూ మండిపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు.

ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారు ప్రధాని మోదీ… రాష్ట్రంలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను, ఇది మోదీ గ్యారంటీ. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చెప్తాడన్నారు. మోదీ గ్యారంటీ అంటే.. ఇచ్చిన హామీని నెరవేర్చే గ్యారంటీ అన్నారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలి. ఇప్పటికే భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారింది. విదేశాల్లో చాలామంది తెలుగు వారు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారన్నారు మోదీ. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్‌ 370ని రద్దు చేశామన్నారు. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన జరిగిందన్నారు. ఇవాళ మీ అందరికి ఒక గ్యారంటీ ఇస్తున్నా… రాసుకోండి. ప్రపంచంలో భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు.

కాంగ్రెస్ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారన్న మోదీ… కాంగ్రెస్ పాలనలో వారి కుటుంబాలు బాగుపడ్డాయి. కాని, ప్రజలు బాగుపడలేదన్నారు. కుటుంబ వాదాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. కుటుంబవాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందన్నారు. కుటుంబవాదులకు దోపిడీ చేసే లైసెన్స్ ఉందా…..? కొంతమంది నాకు అసలు కుటుంబమే లేదని విమర్శిస్తున్నారు. ఆ నాయకులకు తమ కుటుంబమే ముఖ్యం. నాకు మాత్రం దేశమే ముఖ్యం… దేశంలో ప్రతి కుటుంబం ముఖ్యమన్నారు. ఆ నాయకుల దేశంలో అనేక మందిని రాజకీయంగా ఎదగనివ్వలేదన్నారు. యువకులకు కాకుండా వృద్ధులకు మాత్రమే వారు అవకాశం ఇచ్చారన్నారు. కుటుంబవాదులు తమ ఖజానా నింపుకుంటారంటూ మండిపడ్డారు. కొందరు నాయకులు గిఫ్ట్ లు తీసుకొని ఖజానా నింపుకుంటున్నారన్నారు. వారి దొంగసొత్తును బయటకు కక్కిస్తున్నామన్నారు మోదీ.

మీరు తలదించుకునేలా చేయబోను. కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారన్నారు. ఓ వర్గం తమ కుటుంబాలకు విలాసవంతమైనవి కట్టించారు. మేం మాత్రం దేశంలో పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించామన్నారు. అందుకే నాకు కుటుంబం లేదంటూ కొందరు నేతలు విమర్శిస్తున్నారు మోదీ. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమన్నారు. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా కుటుంబమేనన్నారు. ఇండియా కూటమికి ఇది అర్థం కావడంలేదన్నారు. అందుకే తాము మోదీ కుటుంబ సభ్యులమని ప్రజలందరూ అంటున్నారన్నారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టామన్నారు. దళితుల సమస్యలు అర్థం చేసుకున్నాం కాబట్టి మాదిగల వర్గీకరణకు మద్దచిచ్చామన్నారు.