Home Page SliderNational

IPLలో బెంగుళూరు తొలి విజయం

Share with

“ఇంట గెలిచి రచ్చ గెలవాలి” అని మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు. ఆ మాటల్ని నిజం చేస్తూ నిన్న బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన RCB Vs PBKS మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు పంజాబ్‌పై నెగ్గి తొలి విజయం సాధించింది. ఈ మేరకు నిన్నటి మ్యాచ్‌లో RCB టీమ్ తమ సొంతగడ్డపై నెగ్గింది. చిన్న స్వామి స్టేడియంలో సోమవారం  జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ తన షాట్లతో అదరగొట్టారు. అయితే పంజాబ్ కింగ్స్ 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌పై గెలవడం బెంగుళూరుకు  కత్తి మీద సామే అయినప్పటికీ కింగ్ కోహ్లీ తీవ్రంగా శ్రమించి జట్టును గెలుపు దిశగా నడింపించడంలో కీలక పాత్ర పోషించారు.ఓ వైపు వికెట్లు పోతున్న..మరోవైపు జట్టు సహకారం అంతగా లేకపోయినా కింగ్ కోహ్లీ తన షాట్లతో అదరగొట్టి 77 పరుగులు చేశారు. అయితే చివర్లో ఒత్తిడితో గ్రౌండ్‌లోకి అడుగు పెట్టిన దినేశ్ కార్తీక్,లొమ్రార్ ఆటలో అదరగొట్టి బెంగుళూరు జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ విధంగా బెంగుళూరు టీమ్ IPL-17లో మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.