భారతీయులకు అమెరిాకా భారీ ఉరట
• యూఎస్ లో రెమిటెన్స్ పన్నుపై ఎన్ఆర్ఐ భారీ ఊరట
• తొలిగా ప్రతిపాదించిన 5 శాతం పన్నును 1 శాతానికి తగ్గింపు
• బ్యాంక్, క్రెడిట్ , డెబిట్ కార్డు లావాదేవీలకు పూర్తి మినహాయింపు
• సెనెట్లో స్వల్ప మెజారిటీతో బిల్లుకు గ్రీన్ సిగ్నల్
• ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’లో కీలక నిర్ణయం
అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు ఊరట లభించింది. స్వదేశంలోని తమ కుటుంబాలకు పంపే నగదుపై (రెమిటెన్స్) విధించాలని ప్రతిపాదించిన పన్నును ప్రభుత్వం తగ్గించింది. తొలుత 5 శాతంగా ఉన్న ఈ పన్నును తాజాగా ఒక శాతానికే పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన ఈ బిల్లు అమెరికా సెనెట్లో ఆమోదం పొందింది.
- బ్యాంకు లావాదేవీలకు మినహాయింపు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’లో ఈ రెమిటెన్స్ పన్నును చేర్చారు. ముసాయిదా ప్రకారం ఈ పన్నును ఒక శాతానికి తగ్గించారు. బ్యాంక్ ఖాతాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే నగదు బదిలీలకు ఈ పన్ను నుంచి పూర్తి మినహాయింపును కల్పించారు. మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్కుల ద్వారా సొమ్ముకు ఒక శాతం పన్ను వర్తిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు.
- తొలగిన ఆందోళన
ఈ ఏడాది మే నెలలో ఈ పన్నును తొలిసారిగా 5 శాతం చొప్పున విధించాలని ప్రతిపాదించారు. అమెరికా పౌరులు కాకుండా హెచ్1బీ వీసాదారులు, గ్రీన్కార్డు హోల్డర్లు విదేశాలకు పంపే నిధులపై వర్తిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నిర్ణయం అమలైతే ఏటా వారిపై దాదాపు 1.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13,600 కోట్లు) ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అంచనాలు వెలువడ్డాయి. తాజా నిర్ణయంతో ఆ ఆందోళన తెరపడింది.