ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ కు ఇదే సరైన సమయం..
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించనున్న భారత్లో ఒలింపిక్స్ జరగాలని IOC మెంబర్ నీతా అంబానీ ఆకాంక్షించారు. 2036లో ఒలింపిక్స్ జరిగేందుకు ప్రధాని బిడ్ వేస్తారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడం నిజంగా దేశానికి గర్వకారణమన్నారు. ఒకవేళ బిడ్ వేసి హోస్ట్ చేస్తే గ్రీనెస్ట్ ఒలింపిక్స్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్కు ఇదే సరైన సమయమన్నారు నీతా అంబానీ.