ప్రముఖ రెస్టారెంట్ లోని సాంబార్ రైస్ లో బొద్దింక
హైదరాబాద్ లోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో ఉన్న మినర్వా హోటల్ లోని సాంబార్ రైస్ లో బొద్దింక దర్శనమిచ్చింది. నగరానికి చెందిన రాణా అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం హోటల్ కి వెళ్లి సాంబార్ రైస్ ఆర్డర్ చేశాడు. తింటుండగా బొద్దింక కనిపించడంతో షాక్ కు గురయ్యాడు. హోటల్ నిర్వహకులను నిలదీయగా నిర్లక్ష్యంగా బదులిచ్చారు. దీంతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బేగంపేట్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ అధికారి మినర్వా హోటల్ కి వచ్చి ఫుడ్ శాంపిల్స్ తీసుకుని నాచారంలోని ల్యాబ్ కు తరలించారు. రిపోర్ట్ ఆధారంగా హోటల్ నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

