Home Page SliderNational

కుప్పకూలిన టీమిండియా.. 46 పరుగులకే ఆలౌట్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కుప్పకూలింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాను కివీస్ బౌలర్లు వణికించారు. ప్రత్యర్థి బౌలర్లు విజృంభించడంతో 46 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో ఐదుగురు డకౌట్ అయ్యారు. కోహ్లి, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మధ్యలో యశస్వి జైస్వాల్ (13), రిషబ్ పంత్ (20) ఆదుకునే ప్రయత్నం చేశారు. పంత్ ఔట్ కావడంతో రోహిత్ సేన 39 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 31.2 ఓవర్లలో 46 రన్స్ కు చేతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లు తీయగా… విలియం ఓ రూర్కే నాలుగు వికెట్లతో భారత ఇన్నింగ్స్ పతనంలో తన వంతు పాత్ర పోషించాడు.