ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్ ……!
ఎల్లప్పుడూ అభిమానుల ఏదో ఒక పోస్ట్ తో ట్రెండింగ్ లో ఉంటుంది రష్మిక మందన్న. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటడ్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ అమ్ముడు. రష్మిక షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పోస్ట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. తనకు ప్రమాదం జరిగిందని రష్మిక చెప్పింది. దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తనకు ఏమైంది.? ఎప్పుడు జరిగింది .? ఇప్పడు ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. గత నెలలో నాకు చిన్న ప్రమాదం జరిగింది. డాక్టర్ సలహా మేరకు ఇంట్లోనే ఉండి కోలుకున్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను’ అని రష్మిక మందన్న తన అభిమానులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. నెలరోజులుగా నేను యాక్టివ్గా లేను. ఓ చిన్న ప్రమాదం జరగడమే అందుకు కారణం. డాక్టర్స్ సూచన మేరకు ఇంటివద్దే ఉంటున్నా. త్వరలోనే మళ్లీ షూటింగ్స్ కు హాజరవుతా. జీవితం చాలా విలువైనది. జాగ్రత్తగా ఉండండి. రేపనేది ఉంటుందో లేదో తెలీదు. హ్యాపీగా జీవించండి’ అని పోస్ట్ పెట్టిన రష్మిక మందన్నా.