డీఎస్ మృతిపై చంద్రబాబు సంతాపం
టిజి: కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డిఎస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు చెప్పారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని పేర్కొన్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.