కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు శూన్యమే…
తెలంగాణ టెక్స్టైల్ రంగానికి ఊతమివ్వాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నేతన్నల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరినా కేంద్ర నిర్లక్ష్యం వహిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో కొన్నేళ్లుగా తెలంగాణకు శూన్యమే అందుతుందన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు, సిరిసిల్ల మెగా పవర్లూం క్లస్టర్కు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. టెక్స్టైల్, చేనేత రంగంపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్లాక్లెవల్ హ్యాండ్లూం క్లస్టర్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరారు. నేతన్నల పల్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

