అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజస్థాన్లోని అజ్మీర్లోని ఖ్వాజా మొహీయుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు. ఖ్వాజా దర్గాలో చాదర్ను సమర్పించారు. అనంతరం దర్గా పెద్దలను కలిసిన కవిత మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కవిత కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కవిత తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో లౌకికత్వానికి, తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. అనంతరం పుష్కర్, శ్రీనాథ్జీ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నాయకులు ఆజం అలీ, బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, బాబా ఫసియొద్దీన్ తదితరులు కవిత వెంట ఉన్నారు.


