విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు.
బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో స్పందించారు. “నాపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. వినయంతో, పూర్తి బాధ్యతతో ఈ పదవిని నిర్వహిస్తాను” అని తెలిపారు.
కర్ణాటకకు చెందిన ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించారు. కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖల మంత్రిగా సేవలందించిన ఆయన, 2024 ఎన్నికల అనంతరం వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖల బాధ్యతలు నిర్వహించారు.
ఇప్పుడు దేశ విద్యా రంగానికి సంబంధించిన కీలక శాఖ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

