Breaking NewsBusinessHome Page Sliderhome page sliderInternationalNews

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎటువంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త ధోరణిని అవలంబించారు. ముఖ్యంగా ఈ వారం చివర్లో రానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ట్రేడర్లు దృష్టి సారించారు.బీఎస్ఈ సెన్సెక్స్ 118.96 పాయింట్లు (0.15%) నష్టపోయి 81,785.74 వద్ద సెటిల్ అయింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 5044.8 పాయింట్లు (0.18%) తగ్గి 25,069.2 వద్ద ట్రేడ్ ముగిసింది.సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, ఎం & ఎం, టైటాన్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ (జొమాటో), అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి.విస్తృత మార్కెట్‌లో నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.44%, నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.76% లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 2.41% పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఫ్లిప్‌సైడ్‌లో నిఫ్టీ ఐటీ 0.58%, నిఫ్టీ ఫార్మా 0.64% క్షీణించాయి.గ్లోబల్ క్యూస్ లేకపోవడం, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయానికి ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో దేశీయ సూచీలు ఒత్తిడిలో ముగిశాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.