Home Page SliderInternationalNewsPolitics

చిక్కుల్లో బంగ్లా మాజీ ప్రధాని కూతురు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు డాక్టర్ సైమా వాజెద్ చిక్కుల్లో పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్-ఈస్ట్ ఏషియా ప్రాంతానికి ఆమె రీజినల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే సొంత దేశంలో అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడంతో.. డబ్ల్యూహెచ్ వో ఆమెను నిరవధిక సెలవులపై పంపింది. ఆమెను సెలవులపై పంపించిన డబ్ల్యూహెచ్ఓ .. సైమా స్థానంలో డాక్టర్ కాథరినా బూమీ ఇంచార్జి గా కొనసాగుతారని వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిసిన ఓ అధికారి.. ఆమెను శాశ్వతంగా తప్పించాలని ఐక్యరాజ్య సమితి విభాగానికి విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంటే.. డబ్ల్యూహెచ్ఓ రీజనల్ ఆఫీస్ న్యూఢిల్లీలోనే ఉంది. కాథరినా జులై 15వ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. సైమా వాజెద్ పై అధికార దుర్వినియోగం, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులను బంగ్లాదేశ్ యాంటీ కరప్షన్ కమిషన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.1972 డిసెంబర్ 9న డా.ఎం.ఎ. వాజేద్ మియా న్యూక్లియర్ సైంటిస్ట్, షేక్ హసీనా దంపతులకు సైమా వాజెద్ జన్మించారు. ఫ్లోరిడా అమెరికా బ్యారీ యూనివర్సిటీలో ఆమె సైకాలజీలో డిగ్రీ, పీజీ చేశారు. స్కూల్ సైకాలజీలో స్పెషలిస్ట్ అయిన ఆమె.. ఆటిజం, మానసిక ఆరోగ్యంపై ఆమె చేసిన ప్రచారాలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులకు దారితీశాయి. డబ్ల్యూహెచ్ఓ ఆమె నేతృత్వంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది.