Home Page SliderInternationalPoliticsviral

పాక్ గగనతలం మూస్తే నష్టం ఎవరికి?

ఉగ్రదాడికి ప్రతిగా పాక్‌పై భారత్ చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. దానికి నిరసనగా పాకిస్తాన్ కూడా తన గగన తలాన్ని భారత విమానాలకు మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల భారత్‌కు నష్టం అని భ్రమపడిన పాకిస్తాన్ ఎంత నష్టపోతోందో నిపుణులు అంచనా వేశారు. భారత్ కంటే పాకిస్తాన్‌కే నష్టం ఎక్కువ అని తేల్చి చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ గగన తలాన్ని వాడుకున్నందుకు భారత్ సొమ్ము చెల్లిస్తుంది. 2019లో కూడా 140 రోజుల పాటు గగన తలాన్ని మూసేసిన పాక్ అప్పట్లోనే 100 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు ఏకంగా మూసేస్తే పాకిస్తాన్ భారీగా నష్టపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు.