ఐపీఎల్లో క్రేజ్ ఈ జట్టుకే..
ఐపీఎల్ 2025లో అత్యధికంగా 41.7 కోట్ల వ్యూస్తో ఆర్సీబీ టాప్ పొజిషన్లో నిలిచింది. ప్రేక్షకుల ఆదరణ పొందిన జట్టుగా టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ జియోహాట్ స్టార్లో టాప్ 4 మ్యాచ్లలోనూ ఆర్సీబీ ఆడడం విశేషం. ఆర్సీబీ -కేకేఆర్ ( మొదటి మ్యాచ్)కు అత్యధికంగా 41.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆర్సీబీ- సీఎస్కే మ్యాచ్కు 37.2 కోట్ల వ్యూస్, బెంగళూరు -ముంబైకి చెందిన 34.7 కోట్లు, బెంగళూరు-చెన్నై మ్యాచ్కి 34.6 కోట్ల వ్యూస్ వచ్చాయని జియో పేర్కొంది.

