టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి
తాను టీడీపీలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. ఎన్టీఆర్ తో తన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేసిన ఆయన.. హైదరాబాద్ ను డెవలప్ చేసింది వందకు వందశాతం చంద్రబాబేనని అన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తీగల పేర్కొన్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక చంద్రబాబును కలిసిన మల్లారెడ్డి తన మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి సీఎంను ఆహ్వానించారు.


 
							 
							